న్యూస్రీల్
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
● ర్యాలీలు..విజయోత్సవాలు
జిల్లాలో మే డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. సంగారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక నేతలు వివిధ పరిశ్రమల నుంచి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కార్మిక జెండాను ఆవిష్కరించారు. సదాశివపేటలో కార్మిక దినోత్సవానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఖేడ్ ఆర్టీసీ డిపోలో కార్మికులు విజయోత్సవ సంబురాలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరై కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్మిక దినోత్సవానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి హాజరై ప్రసంగించారు.
సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్/సంగారెడ్డి ఎడ్యుకేషన్/సంగారెడ్డి జోన్:


