ఘనంగా కార్మికుల దినోత్సవం
జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, పటాన్చెరు, జోగిపేట, న్యాల్కల్, హత్నూర, జిన్నారం, జహీరాబాద్ మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయుసీ, బీఆర్టీయూ, ఆయా పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యేలు, కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.
– సాక్షి నెట్వర్క్:


