జిల్లా అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి అంశాలు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయన్నారు. విజయం ఒక్కరోజులో సాధ్యం కాదని, నిరంతర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అఖిలేశ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, డైరెక్టర్ రాజేశ్ కుమార్, ట్రైనర్ అరవింద, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ కె. కష్ణ కుమార్ పాల్గొన్నారు.


