
జనావాసాల్లో మురుగు కుంటలు
హుస్నాబాద్: పట్టణంలో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. తడి, పొడి, హానికమైన చెత్తపై ప్రజలకు అవగాహన, వాటర్ ట్యాంక్ల వద్ద తాగునీటి క్లోరినేషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. కుంటలను తలపించేలా ఇండ్ల మధ్య మురికి నీరు నిలువడంతో దోమలకు నిలయంగా మారింది. మురుగునీరు బయటకు వెళ్లే మార్గం చేయకపోవడంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్స్ కాలనీలో డ్రైనేజీ లేక మురుగు, చెత్త ఒకే చోట నిలిచి పందులకు ఆవాసాలుగా మారుతోంది.