
డ్రగ్స్తో జీవితాలు చిత్తు
సిద్దిపేటకమాన్: డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని సీపీ అనురాధ పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం పలువురు అధికారులు పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్కు అలవాటు పడి విద్యార్థులు సమస్యలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్పై పెయింటింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి త్వరలో ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో జిల్లా కేంద్రంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు, సిబ్బంది వినియోగించే ఆయుధాలు, ఇతర పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి, సుమన్కుమార్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, శ్రీధర్గౌడ్, దుర్గ, ఎస్ఐలు అపూర్వరెడ్డి, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ అనురాధ
ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

డ్రగ్స్తో జీవితాలు చిత్తు