మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని తోల్కట్టలో ప్రభుత్వ భూములను కాపాడాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 143, 108, 155, 124, 135, 134, 107లలో పూర్తిగా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత సర్వే నంబర్లు 107, 124, 135 అక్రమంగా పట్టాలుగా మార్చుకున్నారని, మిగతావి సైతం కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ను కలిసిన వారిలో శివశంకర్గౌడ్, మల్లేష్, అంజయ్య తదితరులు ఉన్నారు.
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
కందుకూరు: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రో డ్డు పక్కకు దూసుకెళ్లింది. వివరాలివీ.. ఇబ్ర హీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం గుమ్మడవెల్లి మీదు గా ఆకులమైలారం వెళ్లే క్రమంలో అదుపు తప్పింది. గుమ్మడవెల్లి రైతు వేదిక సమీపంలో పొలాలకు వేసిన కడియ రాళ్లను ఢీకొట్టి ఆగిపోయింది. కొంత సేపటి తర్వాత బస్సును అక్కడి నుంచి డ్రైవర్ తీసుకెళ్లాడు. ప్రమాద సమయంలో బస్సులో 25మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గొలుసుకట్టు కాలువల పునరుద్ధరణకు కృషి
ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి
తుర్కయంజాల్: గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించి ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు సులువుగా ప్రవహించేలా చర్యలు చేపట్టనున్నట్టు ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు అలుగు పారే అవకాశాలు ఉండడంతో తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు, ఈదుల చెరువుల కాలువలను ఏఈ వంశీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. కాలువులు పూడిక తీయకంపోవడంతో పలు చోట్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వరద వచ్చినా సులువుగా ప్రవహించి, కాలనీలు ముంపునకు గురవకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు పులిమామిడి జెడ్పీహెచ్ఎస్
కందుకూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ (సీజీఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల పరిధిలోని పులిమామిడి జిల్లా పరిషత్ పాఠశాల ఎంపికై ంది. ఇందులో భాగంగా పాఠశాల పరిధిలో వాటర్ హార్వెస్టింగ్ పిట్, కంపోస్టు పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మదర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ (సోలార్), ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ మ్యాప్ అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీజీఆర్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రజనీకాంత్ హెచ్ఎం రవీందర్రెడ్డికి ధ్రువపత్రం అందించారు.

యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు పులిమామిడి జెడ్పీహెచ్ఎస్

ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి