డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

Jun 24 2025 7:37 AM | Updated on Jun 24 2025 7:37 AM

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

● షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ

కేశంపేట: సమాజంలో అందరూ యూనిఫాం లేని పోలీసులేనని షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమ వారం యాంటీ డ్రగ్స్‌ అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేయా లని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ కలిగి ఉన్నా చట్టరీత్యా నేరామని తెలిపారు. సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ నమ్మొద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ నరహరి, ఎస్‌ రాజ్‌కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement