
డ్రైనేజీ నిర్మాణం.. అస్తవ్యస్తం..!
శంషాబాద్: శంషాబాద్ పట్టణ ప్రధాన రహదారిలో చేపట్టిన డ్రైనేజీ పనులు.. మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వెళ్లే రహదారిలో రైల్వే కమాన్ వద్ద ప్రధాన మార్గంలో డ్రైనేజీ లైను కలిపేందుకు రెండు రోజుల క్రితం పనులు చేపట్టారు. పైపులు వేసిన తర్వాత దానిని రహదారికి సమాంతరంగా కాకుండా చాలా ఎత్తులో సిమెంట్ పనులు చేశారు. దీంతో పైపులపై వేసిన సిమెంట్ వల్ల అది కాస్తా ఎత్తైన స్పీడు బ్రేకర్లా తయారైంది.
● ఇది ఒక ఎత్తైతే నాణ్యత లేకుండా నిర్మించినందున గడచిన దానిపై రంద్రాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా రెండు రోజుల్లోనే అదికాస్తా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను కల్గిస్తోంది. కింద ఉన్న డ్రైనేజీ బయటపడేలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వేగంగా వచ్చే వాహనాలు ఎత్తుగా ఉండటంతో ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వస్తుండటంతో తరచూ ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి.
● ఇకనైనా మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నాణ్యత లేమితో చేపట్టిన పనులను వెంటనే సరిద్దాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
● ఈ ప్రాంతంలోనే ఆరు నెలల క్రితం బస్టాప్ ఏ ర్పాటు చేశారు. అప్పట్లో మిగిలిన మట్టి, రా తిపౌడర్ ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేశారు. అ వి పూ ర్తిగా గట్టిపడిపోయాయి. కొంతకాలంగా రహ దా రికి అడ్డుగా ఉన్నందున రాకపోకలు సా గించే వా హనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. అ యి నా మున్సిపల్ అధికారులు మాత్రం దా నిని తొలగించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
పనుల్లో నాణ్యతాలోపం
రెండు రోజులకేగుంతలుగా మారిన వైనం
ప్రమాదాల బారిన వాహనదారులు
అధికారుల తీరుపై ప్రజాగ్రహం
సరిదిద్దుతాం
ఔట్ లెట్కు సమాంతరంగా ఉన్న కారణంగా రోడ్డుకన్నా ఎక్కువ ఎత్తులో డ్రైనేజీని నిర్మించా ల్సి వచ్చింది. వ్యర్థాలను వెంటనే తొలగించి.. మిగిలిన పనులను పూర్తిచేసి రోడ్డును సరిదిద్దు తాం. వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– నరేష్, ఏఈ శంషాబాద్ మున్సిపాలిటీ