
లారీ ఢీకొని యువకుడి మృతి
ఆమనగల్లు: లారీ ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన మహేందర్నాథ్ అలియాస్ టిల్లు(23) బైక్పై వెళ్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి మధ్యప్రదేశ్కు పత్తిలోడ్తో వెళ్తున్న లారీ కాటన్మిల్లు సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి నగరానికి వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి
యాచారం: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు.. నగర శివారులోని జిల్లెలగూడకు చెందిన శ్రీనాథ్(18), స్నేహితులు మణిదీప్, చరణ్లతో కలిసి శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాక్ కాలనీకి వెళ్లారు. ఆలస్యం కావడంతో రాత్రి చింతపల్లి మండలం వింజమూర్లోని బంధువుల ఇంట్లో నిద్రించారు. ఆదివారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు శ్రీనాథ్.. మిత్రులతో కలిసి బైక్పై నగరానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో సాగర్రోడ్డుపై చౌదర్పల్లి గేట్ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ దుర్మరణం చెందగా.. మణిదీప్, చరణ్లు గాయపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది.
అగ్ని ప్రమాదం
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని శాసీ్త్రపురం కాలనీలోని ప్లాస్టిక్ చైర్ పరిశ్రమంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు అగ్నిపమాక, పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్, చందులాల్ బారాదారి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా దం జరిగినప్పుడు పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.