
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం షాబాద్ మండల పరిధి చందనవెళ్లి గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా చాకలి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా గడీల మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్, యువజన కమిటీ అధ్యక్షుడిగా చిప్పలపల్లి శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా శివలను నియమించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తాయి నుంచే ఐక్యమత్యం కావాలన్నారు. అందుకే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్చారి, జిల్లా నాయకులు వెంకటేశ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి చంద్రశేఖర్, నందిగామ మండల ఉపాధ్యక్షుడు నర్సింహులు, షాబాద్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, గ్రామ పెద్దలు చేవెళ్ల స్వామి, మాజీ సర్పంచ్లు లింగం, శ్రీనివాస్గౌడ్, నాయకులు రాఘవచారి, మల్లేశ్, వెంకటేశ్, వడ్ల మల్లేశ్, తదితరులు ఉన్నారు.
బీసీసేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ