
ఆదివారం ఆగని దందా
షాద్నగర్రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో సెలవురోజున పుస్తకాల దందా కొనసాగుతోందని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం బుక్స్ విక్రయిస్తుండగా.. ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేసి రాత పుస్తకాలు తీసుకుంటేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని మెలిక పెడుతూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరలకు నోట్స్ను అంటకడుతూ డబ్బులు దండుకుంటున్నారని తెలి పారు. పాఠశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై గతంలో మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి.. బుక్స్, యూనిఫాంలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్, రఘు, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సెలవు రోజుల్లోనూ పుస్తకాల విక్రయం
నిబంధనలు పాటించని పాఠశాలలు
చర్యలు తీసుకోవాలంటూఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్