
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్కూల్ టీచర్ సమైక్య(ఎస్టీఎఫ్) తెలంగాణ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్యకు ఓడీ సౌకర్యం లభించడంతో ఆయనను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దాంతో పాటే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్, ప్రతినిధులు విఠల్, రమేష్, రాంచంద్రయ్య, రాంచందర్, నర్సింహులు, లక్ష్మినారాయణ, దిలీప్, భగవత్గీత, రాజారావు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు పి.సుధాకర్, వెంకటస్వామి, రజిత, సంతోష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య