
గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: స్థానిక కస్తూర్బాగాంఽధీ బాలికల పాఠశాలలో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఇన్చార్జి శ్వేతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల ఈఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి అప్గ్రేడ్ అయిందని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు బోధన చేసేందుకు బోటనీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం ఉందన్నారు. అభ్యర్థులు పీజీ, బీఎడ్ అర్హతలు కలిగి ఉండాలని చెప్పారు. ఎంఎల్టీ కోర్సు (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) బోధించేందుకు సైతం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వసతిగృహానికి డే వాచ్ఉమెన్ పోస్ట్ ఖాళీగా ఉందని, పదో తరగతి చదివిన మహిళలు అర్హులని తెలిపారు. ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 91004 39368 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడు
షాద్నగర్ః పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన ఆయనను అర్చకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాది మోముల బసప్ప, నాయకులు బస్వం, దండు వాసు, ఒగ్గుకిశోర్, జాంగారి రవి, మార్గం రాజేష్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల
శంకర్పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మళ్లీ సమయం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్రెడ్డి, సభ్యులు మోహన్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
చీకటి వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన
కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని చీకటి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంతోష్కుమార్ పాండ్యే సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు ఆలయ చరిత్రను ఆయనకు వివరించారు. తెలంగాణలో వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన నిత్యం నాలుగు పురాతన దేవాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నట్లు తెలిసింది.

గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం