
సామాన్యులను విస్మరిస్తున్న కేంద్రం
కందుకూరు: నరేంద్రమోదీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. మండల పరిధిలోని నేదునూరు గేట్ వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్లో ఆదివారం పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ ఆధ్వర్యంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రమేష్, పగడాల యాదయ్య మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను విస్మరిస్తోందనిపేర్కొన్నారు. రైల్వే, విమానయానం, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యురాలు కవిత, ఆమనగల్లు, మహేశ్వరం పార్టీ కార్యదర్శులు శివశంకర్, ఏర్పుల శేఖర్, సీఐటీయూ నాయకులు గుమ్మడి కుర్మయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్