
అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి చోరీ
కొత్తూరు: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళీగౌడ్ తెలిపిన ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న యువజన కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్గౌడ్ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి షాబాద్లో బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చే వరకు తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానంతో పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పో లీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
రూ.15లక్షల నగదు అపహరణ