రూ.కోటి విలువైన కొకై న్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన కొకై న్‌ పట్టివేత

Jun 4 2025 7:50 AM | Updated on Jun 4 2025 7:50 AM

రూ.కో

రూ.కోటి విలువైన కొకై న్‌ పట్టివేత

జీడిమెట్ల: తిరుపతి నుండి హైదరాబాద్‌కు కొకై న్‌, ఇపిడ్రిన్‌ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తుల ముఠాను బాలానగర్‌ ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకై న్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి, ఎస్‌వోటీ డీసీపీ డి.శ్రీనివాస్‌ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు ఏపీలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌..

తిరుపతికి చెందిన గుణశేఖర్‌ ఏపీలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29వ తేదీన 820 గ్రాముల కొకై న్‌ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పంపించాడు. గుణశేఖర్‌ చెప్పినట్లుగానే సురేంద్ర కొకై న్‌ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్‌పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్‌ రప్పించాడు. అదేవిధంగా సురేంద్ర చేగూడి, మెర్సి మార్గరెట్‌, షేక్‌ మస్తాన్‌ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో కలుసుకున్నారు.

జూన్‌ 2న పోలీసులు బిజీగాఉంటారని

రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జూన్‌2న పోలీసులు బిజీగా ఉంటారని..ఆరోజే కొకై న్‌ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి భాగ్యనగర్‌ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకై న్‌ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు కొకై న్‌ వీరికి ఎక్కడ నుండి వచ్చిందనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్‌ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్‌పల్లి ఏసీపీ రవికుమార్‌, ఇన్స్‌పెక్టర్‌ రాజేశ్‌, బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్స్‌పెక్టర్‌ శివకుమార్‌, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు.

మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

తిరుపతి నుంచి కొకై న్‌, ఎపిడ్రీన్‌ తదితర డ్రగ్స్‌ హైదరాబాద్‌కు తరలింపు

ప్రధాన నిందితుడు ఏపీలోపోలీసు శాఖ ఉద్యోగి

రూ.కోటి విలువచేసేకొకై న్‌ స్వాధీనం

ప్రధాన నిందితుడుగుణశేఖర్‌ పరారీ

రూ.కోటి విలువైన కొకై న్‌ పట్టివేత 1
1/1

రూ.కోటి విలువైన కొకై న్‌ పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement