
ఆపరేషన్ సిందూర్ దేశం సత్తా చాటింది
చేవెళ్ల: ఆపరేషన్ సిందూర్తో మన దేశం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో మనం సైతం దేశంకోసం అనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చేవెళ్లలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మన దేశ సైనికుల వీరోచిత పోరాటానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఉండే వాళ్లు దేశం నాశనం కోరితే ఇక్కడ ఉండే హక్కు లేదన్నారు. భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు తెలపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, మండల అధ్యక్షుడు ఎం. శ్రీకాంత్, మొయినాబాద్ అధ్యక్షుడు శ్రీకాంత్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.