
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
మొయినాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ అన్నారు. మండలంలోని ఎత్మార్పల్లిలో బుధవారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆమె రైతులు, గ్రామస్తుల నుంచి 36 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ కాంచనలత తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని వసతులతో కూడిన భవనం అందుబాటులో ఉందన్నారు. అసక్తి ఉన్న వారు దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై
ప్రజాభిప్రాయ సేకరణ
తుక్కుగూడ: రావిర్యాల ఎగ్జిట్– 13 నుంచి మీర్ఖాన్పేట వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం అధికారులు సమవేశం నిర్వహించారు. రావిర్యాల వార్డు కార్యాలయంలో స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ జీఎల్వీ రాజు మాట్లాడుతూ.. మొదటి విడతలో 18.5 కిలోమీటర్ల మేర భూమి సేకరిస్తామని తెలిపారు. పరిహారం, పునరావసం, ఉపాధి కల్పనపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని స్పష్టంచేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
శుభ్రత తప్పనిసరి
ఆమనగల్లు: హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు స్వచ్ఛత నియమాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ హెచ్చరించారు. ఆమనగల్లులోని పలు బేకరీలు, దాబాలు, హోటళ్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించారు. వాణిజ్య సంస్థలు విధిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
సివిల్ ర్యాంకర్కు సన్మానం
షాద్నగర్రూరల్: సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంకు సాధించిన షాద్నగర్ పట్టణానికి చెందిన భరద్వాజ్ను బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘనంగా సన్మానించారు. రాజ్భవన్లో సివిల్స్ ర్యాంకర్లతో గవర్నర్ ఇన్స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వారిని ఆయన సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు.
గంజాయి పట్టివేత
షాద్నగర్రూరల్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఫరూఖ్నగర్లోని ఈద్గా వద్ద గంజాయి అమ్ముతున్న అంజద్ను.. పోలీసులు పట్టుకొని, కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్కు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు