
రైతు సంక్షేమమే ధ్యేయం
యాచారం: వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి తన ఆధీనంలో ఉన్న రూ.కోటిన్నర విలువ చేసే రెండు వేల గజాల స్థలాన్ని బుధవారం వ్యవసాయ శాఖకు అప్పగించారు. స్థానిక రైతులకు సేవలందించాలనే లక్ష్యంతో గతంలో భూస్వామి బొమ్మిడిక మల్లారెడ్డి తన 2వేల ఎకరాల స్థలాన్ని దానం చేశారు. నాటి నుంచి ఈ భూమి కోదండరెడ్డి స్వాధీనంలోనే ఉంది. అప్పటి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు నిధులతో ఇందులో భవనాన్ని నిర్మించి శ్రీవేంకటేశ్వర రైతుమిత్ర సంఘం పేరుతో కర్షకులకు సేవలందిస్తున్నారు. సదరు స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా రైతులకు మరింత న్యాయం జరుగుతుందని కోదండరెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో స్థలాన్ని డైరెక్టర్ ఆఫ్ అగ్రిలక్చర్ డాక్టర్ గోపికి అప్పగించారు. దీని చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్ను పిలిపించి ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. యాచారంలో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న స్థలాన్ని పరిశీలించారు. శేరిగూడకు చెందిన అక్కలి మధుకర్రెడ్డి తన రెండెకరాల భూమిని మోడల్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి విక్రయించేందుకు ముందుకువచ్చారు. దీంతో కోదండరెడ్డి, రంగారెడ్డి అధికారులతో కలిసి స్థలాన్ని సందర్శించారు.
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి
రూ.కోటిన్నర విలువైన స్థలాన్ని వ్యవసాయశాఖకు అప్పగింత
ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ
ఫ్యూచర్సిటీతో మహర్దశ
ఫార్మాసిటీని రద్దు చేసిన రేవంత్రెడ్డి సర్కార్ ఇదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోందని ఎమ్మెల్యే రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో యాచారానికి మహర్దశ పట్టనుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం యాచారం రైతు వేదికలో అన్నదాతలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత్రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, మరికంటి భవాని, రామ్రెడ్డి గోపాల్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహరావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సురేష్, తహసీల్దార్ అయ్యప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఈసీ శేఖర్గౌడ్, బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, అమృతాసాగర్, వెంకటేశ్ నాయక్ తదితరులు