
చోరీకి సోదరే సూత్రధారి
కొత్తూరు: చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సొంత తుమ్ముడి ఇంట్లో రూ.15 లక్షలు అపహరించింది బాధితుడి అక్కేనని గుర్తించారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. నేరం అంగీకరించి, కటకటాల పాలైంది. సీఐ నర్సింహరావు బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధి స్టేషన్ తిమ్మాపూర్కు చెందిన వన్నాడ శివశంకర్గౌడ్ కుటుంబ సభ్యులు, ఇటీవల తమ పొలం విక్రయించడానికి ఇతరులతో ఒప్పందం చేసుకోగా.. కొనుగోలు చేసే వ్యక్తులు వారికి కొంత నగదును అడ్వాన్సుగా చెల్లించారు. కాగా శివశంకర్గౌడ్ తండ్రి, తల్లి పెద్ద కూతురుతో కలిసి విహారయాత్రకు వెళ్లే క్రమంలో ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును శివశంకర్గౌడ్కు ఇచ్చారు.
పాత నేరస్తులతో కుట్ర
ఈ నేపథ్యంలో గత నెల 30న షాబాద్ మండలంలో తమ బంధువుల అంత్యక్రియలకు వెళ్లే సమయంలో శివశంకర్గౌడ్ నగదును బీరువాలో పెట్టాడు. అప్పటికే పొలం విక్రయించిన డబ్బులు ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న కొత్తూరు మున్సిపాలిటీ పరిధి కమ్మరిగూడలో నివాసం ఉంటున్న శివశంకర్ అక్క బోడమ్పల్లి స్వప్న, ఆ డబ్బును కాజేయాలని పథకం వేసింది. తనకు పరిచయం ఉన్న నేర చరిత్ర కలిగిన శంషాబాద్ మండలం షాపూర్కు చెందిన పానమోని అశోక్ను సాయం కోరగా.. అతను అదే మండలం రాళ్లగూడకు చెందిన రఘుతో కలిసి చోరీకి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక ఆటోలో నిందితులు ముగ్గురు తిమ్మాపూర్లోని శివశంకర్గౌడ్ ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న రాడ్తో తలుపు, బీరువా తాళాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు.. శివశంకర్ అక్కపై అనుమానం కలిగింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో వారి నుంచి నగదుతో పాటు కారు, ఆటో, స్కూటీ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ నర్సింహరావు, ఎస్ఐలు మురళీగౌడ్, శ్రీనివాస్చారి, సిబ్బంది కుమార్, నరేష్, రవికుమార్లను శంషాబాద్ డీసీపీ అభినందించారని సీఐ తెలిపారు.
పాత నేరస్తులతో కలిసి కుట్ర
తమ్ముడి ఇంట్లో రూ.15 లక్షలు
అపహరణ
వివరాలు వెల్లడించిన సీఐ
నగదు, కారు రికవరీ