
మక్తల్ ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొన్న కారు
షాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు.