మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్ కవన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. పంటల సాగుతోపాటు మందుల పిచికారీలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, జిల్లా నాయకుడు గున్నాల గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్లు గొర్కంటి రాజు, వినిత, శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ కో ఫౌండర్ టీవీ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ ‘దోస్త్’
షాద్నగర్రూరల్: ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఔత్సాహిక విద్యార్థులు జూన్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసేకునేందుకు ఆవకాశం ఉందన్నారు. ఎంపీసీ, ఎంజెడ్సీ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.
బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటించాలి
మొయినాబాద్రూరల్: ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని జిల్లా పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీరాములు, సీఈ జోగిరెడ్డి అన్నారు. నక్కలపల్లి–హైతాబాద్ మధ్యలో ఈసీ వాగుపై కొనసాగుతున్న వంతెన పనులను శుక్రవారం వారు మండల డిప్యూటీ డీఈ విజయ్కుమార్తో కలిసి పర్యవేక్షించారు. ఈసీవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్) కింద రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు విజయ్కుమార్ అధికారులకు తెలిపారు. పనులు జరుగుతున్న తీరును వారికి వివరించారు. అధికారులు మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో నిర్మించేలా చూడాలని సూచించారు.
పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నిరంజన్రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కమిటీలో చోటు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటించాలి