
గడువులోగా యూనిఫాం అందించాలి
కేశంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గడువులోగా యూనిఫాం అందించాలని డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య భవనంలో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు షర్టుల కోసం వచ్చిన క్లాత్ను కట్టింగ్ చేస్తున్న విధానాన్ని, మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కుడుతున్న టైలరింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభంలోగా అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా టైలరింగ్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈపీఎం బాలరాజ్, ఏపీఎం భగవంతు, సీసీలు పాల్గొన్నారు.