
క్రీడలతో మానసికోల్లాసం
పహాడీషరీఫ్: మామిడిపల్లి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ 7వ సీజన్ విజేతగా ఆర్బీఎం వారియర్స్ జట్టు, రన్నరప్గా రెడ్బుల్స్ జట్లు నిలిచాయి. బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో మొత్తం ఏడు జట్లు మూడునెలల పాటు ఆడాయి. ఈ సందర్భంగా గ్రామ ఆలయాల కమిటీ చైర్మన్ ఎడ్ల వాసుదేవారెడ్డి విజేత జట్టుకు రూ.35వేలు, రన్నరప్ జట్టుకు మాజీ కౌన్సిలర్ ఈరంకి వేణుకుమార్గౌడ్ రూ.25వేల నగదు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో మాజీ కార్పొరేటర్ సుక్క శివకుమార్, గ్రామ నాయకులు నిమ్మల నరేందర్గౌడ్, దశరథ, లిక్కి శ్రీనివాస్రెడ్డి, లిక్కి వినయ్ యోగేందర్రెడ్డి సహకారం అందించారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు దిలీప్కుమార్, కోట్ల కృష్ణ, పెరమోని నరేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.