క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

May 26 2025 7:32 AM | Updated on May 26 2025 7:32 AM

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

పహాడీషరీఫ్‌: మామిడిపల్లి ప్రీమియర్‌ లీగ్‌(ఎంపీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ 7వ సీజన్‌ విజేతగా ఆర్‌బీఎం వారియర్స్‌ జట్టు, రన్నరప్‌గా రెడ్‌బుల్స్‌ జట్లు నిలిచాయి. బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఏడు జట్లు మూడునెలల పాటు ఆడాయి. ఈ సందర్భంగా గ్రామ ఆలయాల కమిటీ చైర్మన్‌ ఎడ్ల వాసుదేవారెడ్డి విజేత జట్టుకు రూ.35వేలు, రన్నరప్‌ జట్టుకు మాజీ కౌన్సిలర్‌ ఈరంకి వేణుకుమార్‌గౌడ్‌ రూ.25వేల నగదు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్‌ నిర్వహణలో మాజీ కార్పొరేటర్‌ సుక్క శివకుమార్‌, గ్రామ నాయకులు నిమ్మల నరేందర్‌గౌడ్‌, దశరథ, లిక్కి శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి వినయ్‌ యోగేందర్‌రెడ్డి సహకారం అందించారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా కూడా స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ నిర్వాహకులు దిలీప్‌కుమార్‌, కోట్ల కృష్ణ, పెరమోని నరేందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement