
ముగిసిన క్రికెట్ లీగ్
తుర్కయంజాల్: సత్యసాయి జయంతిని పురస్కరించుకుని ఆ సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి నిర్వహించిన క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆదివారంతో ముగిసింది. తుది పోరులో తెలంగాణ జట్టుతో తలపడిన తమిళనాడు విజయం సాధించింది. జ్ఞాపికను సొంతం చేసుకుంది. ఈ లీగ్లో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నార్త్, కర్ణాటక సౌత్, తమిళనాడు సౌత్, నార్త్, కేరళతో పాటు.. గ్రామం, జిల్లా, రాష్ట్రం, జోనల్ లెవల్ మొత్తం 850 జట్లు పాల్గొన్నాయని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. జోనల్ లెవల్లో గెలుపొందిన జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో యూనిట్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయఎంపైర్ వి.కె.రామస్వామి. మాజీ చీఫ్ సెలక్టర్ఎం.ఎస్.కె.ప్రసాద్, సేవా సంస్థల జోనల్ అధ్యక్షుడు ముకుందన్, నేషనల్ క్రికెట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.