‘చెత్తవేస్తే ఈ–చలాన్‌’పై అధికారులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

‘చెత్తవేస్తే ఈ–చలాన్‌’పై అధికారులకు శిక్షణ

Mar 7 2025 9:23 AM | Updated on Mar 7 2025 9:23 AM

సాక్షి,సిటీబ్యూరో: ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలు వేసేవారిని గుర్తించి ఈ–చలాన్‌ ద్వారా పెనాల్టీలు విధించి, యూపీఐ ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ సంబంధిత ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్‌ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ సీఎన్‌ రఘుప్రసాద్‌, ఐటీ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంత్‌ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ–చలాన్‌ విధించేందుకు టీసీఎస్‌ ఆధ్వర్యంలో రూపొందించిన విధానాన్ని, యాప్‌ను కాంప్రహెన్సివ్‌ చలాన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీసీఎంఎస్‌) యాప్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు యాప్‌ను నిర్వహించే టీజీ ఆన్‌లైన్‌ ప్రతినిధులు యాప్‌ ఎలా పనిచేస్తుందో, ఎలా వాడాలో వివరించారు. తొలుత పైలట్‌గా చెత్త డబ్బాల్లో కాకుండా బయట చెత్తవేసే వాణిజ్య ప్రాంతాల్లోని వ్యాపారులు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నవారు, సీఅండ్‌డీ వేస్ట్‌ వేస్తున్న వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. సంబంధిత అధికారులు జారీ అయిన చలాన్‌లు, చెల్లింపులు జరిగినవి, పెండింగ్‌లో ఉన్నవి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునన్నారు. చెత్త వేసేవారికి ఎస్‌ఎంఎస్‌ వెళ్తుందని, స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించి వేసిన వ్యర్థాల ఫొటో అక్షాంక్ష, రేఖాంశలతో వస్తుందన్నారు. దేనికి ఎంత పెనాల్టీయో సాఫ్ట్‌వేర్‌లోనే పొందుపరిచి ఉంటుందని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement