పాఠాలు చెప్పేవారేరి? | - | Sakshi
Sakshi News home page

పాఠాలు చెప్పేవారేరి?

Jun 24 2025 4:03 AM | Updated on Jun 24 2025 4:03 AM

పాఠాల

పాఠాలు చెప్పేవారేరి?

● 92 పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ ! ● జిల్లాలో 307 పోస్టులు ఖాళీ ● కుంటుపడుతున్న విద్యాబోధన ● సర్దుబాటుపైనే ఆశలు

గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. జిల్లాలోని 92 స్కూళ్లలో సింగిల్‌టీచర్‌ విధులు నిర్వర్తిస్తుండగా.. 307 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో చేపట్టబోయే టీచర్ల సర్దుబాటు ప్రక్రియపైనే విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో..

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ తరగతికి తగిన ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లావ్యాప్తంగా 92 పాఠశాలల్లో ఒక్క టీచరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఒకే టీచర్‌ అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులు బోధించాల్సిన బాధ్యతలతో అలసిపోతుండడంతో బోధన నాణ్యతపై ప్రభావం పడుతోంది. దీంతో విద్యార్థులకు గణితం, భౌతికశాస్త్రం, ఇంగ్లిష్‌ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో బలహీనతలు ఏర్పడుతున్నాయి. ఇది అతికష్టమైనప్పటికీ ఉపాధ్యాయులు తమవంతు కృషి చేస్తుండగా.. విద్యార్థులు మాత్రం సరైన పాఠాలు, బోధనను పొందలేకపోతున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నా టీచర్ల కొరతతో అవి వృథాగానే మారుతున్నాయి. మౌలిక వసతుల వినియోగం, పాఠశాల నిర్వహణలో పనుల భారం నెలకొంటోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలల్లో నాణ్యత గురించి మాట్లాడలేం.

సర్దుబాటుపైనే ఆశలు

జూలైలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ నిర్వహిస్తారని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య లేని పాఠశాలల నుంచి అవసరమైన చోటుకు బదిలీచేసే ప్రక్రియతో విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. గత విద్యాసంవత్సరం నాటి విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని మండలా లు, జిల్లాల వారీగా ఎన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారు? ఎన్ని చోట్ల అవసరమో.. గణాంకాలు తయారుచేసి సర్దుబాటు ప్రక్రియ చేస్తారని తెలుస్తోంది. జూలై 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1–10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్‌, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 వరకు 3, 91 నుంచి 120 వరకు 4, 121 నుంచి 150 వరకు 5, 151 నుంచి 200 వరకు విద్యార్థులుంటే ఆరుగురు టీచర్ల చొప్పున నియమించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య 200 దాటితే ప్రతీ 40 మందికి ఒక టీచర్‌ చొప్పున నియమించాల్సి ఉంటుంది.

జిల్లాలో 307 పోస్టులు ఖాళీలు

జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 307 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలు 190, స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌ 11, ఫిజిక్స్‌ 6, బయోసైన్స్‌ 12, సోషల్‌ 17, ఆంగ్లం 10, తెలుగు 12, హిందీ 9, స్కూల్‌ అసిస్టెంట్‌ పీడీ 6, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 8, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు తెలుగు 6, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 13, ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 7 చొప్పున ఖాళీగా ఉన్నాయి.

పాఠాలు చెప్పేవారేరి?1
1/2

పాఠాలు చెప్పేవారేరి?

పాఠాలు చెప్పేవారేరి?2
2/2

పాఠాలు చెప్పేవారేరి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement