ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు

Jun 24 2025 4:03 AM | Updated on Jun 24 2025 4:03 AM

ప్రైవ

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు

చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి గ్రామస్తులు సోమవారం ప్రైవేట్‌ స్కూల్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. బండపల్లి నుంచి 65 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్తున్నారని, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 24కు పడిపోవడంతో బడి మూతపడే దశకు చేరుకుంటోందని పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు సోమవారం ఏకమై మాజీ సర్పంచ్‌ కటకం మల్లేశం ఆధ్వర్యంలో ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే తాము పాఠశాలలకు పంపిస్తామని పట్టుబట్టారు. చివరికి గ్రామంలోని 25 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోంద నిజిల్లా, ప్రాథమిక పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు ఆనందరెడ్డి, అనిల్‌రావు తెలిపారు.

శ్యాంప్రసాద్‌ జీవితం ఆదర్శనీయం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్లటౌన్‌: డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ జీవితం ఆదర్శనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో సోమవారం నివాళి అర్పించారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మ్యాన రాంప్రసాద్‌, గరిపెల్లి ప్రభాకర్‌, నాగుల శ్రీనివాస్‌, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి తదితరులు పాల్గొన్నారు.

రూ.8.60 కోట్లతో పద్మశాలీ భవనం

సిరిసిల్లటౌన్‌: రూ.8.60కోట్లతో సిరిసిల్లలో పద్మశాలీ భవనం పనులు ప్రారంభించబోతున్నట్లు ఆ సంఘం పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ తెలిపారు. స్థానిక సంఘం ఆఫీస్‌లో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గతంలో నిధుల కొరతతో నిలిచిపోయిన పద్మశాలీ, మార్కండేయ ఆలయాల పనులు మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి చొరవతో జరుగుతున్నాయన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, తాటిపాముల దామోదర్‌, రాపెల్లి ప్రవీణ్‌, మోర రవి, గాజుల బాలయ్య, కోడం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చదువుకున్న బడికి ఎమ్మెల్యే చేయూత

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తాను చిన్న నాడు చదువుకున్న స్వగ్రామం కోరుట్లపేటలోని ప్రాథమి కోన్నత పాఠశాలకు చేయూతగా నిలిచారు. బడిని సోమవారం పరిశీలించిన సందర్భంగా ఉపాధ్యాయుల కొరత ఉందని తెలుసుకొని.. విద్యావలంటీర్‌ను నియమించుకోవాలని ప్రతీ నెల వేతనంగా రూ.6వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. తన ఊరిలోని బడిని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యంను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సన్మానించారు.

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు
1
1/3

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు
2
2/3

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు
3
3/3

ప్రైవేట్‌స్కూల్‌ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement