మహిళలు గర్వపడేలా చీరలుండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు గర్వపడేలా చీరలుండాలి

Jun 24 2025 4:03 AM | Updated on Jun 24 2025 4:03 AM

మహిళలు గర్వపడేలా చీరలుండాలి

మహిళలు గర్వపడేలా చీరలుండాలి

సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్‌ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు.

ఆత్మగౌరవంతో కట్టుకోవాలి

రాష్ట్రమంతటికీ సిరిసిల్ల చీరలు

సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి

రూ.150కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి

సిరిసిల్లలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement