
పొగాకుతోనే క్షయవ్యాధి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొగాకు తీసుకునే వారిలో ఎక్కువ మంది క్షయవ్యాధికి గురవుతున్నారని మండల వైద్యాధికారి సారియా అంజుమ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట పీహెచ్సీలో సోమవారం టీబీ ముక్త్ అభియాన్లో భాగంగా 118 మందికి పైగా టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 14 మంది అనుమానితులను గుర్తించి పరీక్షల కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారిణి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు షుగర్, క్యాన్సర్, బీపీతోపాటు పొగాకు తీసుకునే వారు క్షయవ్యాధికి గురవుతున్నట్లు తెలి పారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, వైస్చైర్మన్ రాంరెడ్డి, సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు.