
డ్రగ్స్ నిర్మూలనతోనే బంగారు భవిష్యత్
సిరిసిల్లక్రైం/ఇల్లంతకుంట(మానకొండూర్): డ్రగ్స్ నిర్మూలనతోనే భావితరాల భవిష్యత్ బాగుంటుందని.. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మత్తు పదార్థాల నిర్మూలనపై సిరిసిల్లలో సోమవారం చేపట్టిన 2కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గంజాయి, మత్తుపదార్థాల సమాచారాన్ని 87126 71111, డయల్ 100లో సమాచారం ఇవ్వాలని కోరారు. సీఐలు మొగిలి, నాగేశ్వరరావు, నటేశ్, మధుకర్, స్పెషల్బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఎస్సైలు కిరణ్కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీని వాస్, ఆర్ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట ఠాణాలో మొక్క నాటిన ఎస్పీ
ఇల్లంతకుంట పోలీస్స్టేషన్ ఆవరణలో ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, ఎస్సై సిరిసిల్ల అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు భరోసా గ్రీవెన్స్ డే
సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. 36 ఫిర్యాదులు స్వీకరించి.. పరిష్కరించాలని ఆయా ఠాణాల అధికారులకు ఆదేశించారు. చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లలో 2కే రన్

డ్రగ్స్ నిర్మూలనతోనే బంగారు భవిష్యత్