
కుమ్మరికుంటలో కారు ఢీకొని వృద్ధుడు మృతి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో కారు ఢీకొ ని అదే గ్రామానికి చెందిన నాగవెల్లి మొండయ్య(59) మృతి చెందాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంటకు చెందిన మొండయ్య శుక్రవారం సైకిల్పై పోస్టాఫీసుకు వెళ్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కమటం రవి తన కారును వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సైకిల్పై వెళ్తున్న మొండయ్యను ఢీకొట్టాడు. కిందపడ్డ మొండయ్య తలకు బలమైన గాయం కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శని వారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్లేక్లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా?
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని పోచమ్మ ఆలయం సమీపంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రెండురోజుల క్రితం జగిత్యాల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడున్నట్లు సమాచారం. పోలీసులు దాడి చేసిన సమయంలో నాలుగైదు డిగ్రీ సర్టిఫికెట్లు దొరికినట్లు తెలిసింది. మంత్ర కంప్యూటర్స్ పేరిట సాగుతున్న ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లోనే నకిలీ సర్టిఫికెట్ల ముఠా దందా నడుపుతున్నట్ల తెలిసింది. కోరుట్లలో ఉన్న నకిలీ సర్టిఫికెట్ల తయారుదారులతో ఇంకా ఎవరికై నా సంబంధాలు ఉన్నాయా..? అన్న విషయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను రూ.15వేల నుంచి రూ.30 వేల వరకు అమ్మినట్లు సమాచారం. కేవలం డిగ్రీ కాకుండా ఇతరత్రా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.