రాగి తీగ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రాగి తీగ దొంగల అరెస్ట్‌

Jun 22 2025 3:30 AM | Updated on Jun 22 2025 4:06 AM

మెట్‌పల్లి: ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్‌ను ఎత్తుకెళ్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మెట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మోతె సాయి(22), పల్లపు మల్లేశం(32) ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్‌ అపహరించి అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో ఇద్దరిని పట్టుకొని వారి నుంచి వంద కిలోల రాగి వైరు, ద్విచక్రవాహనం, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

కొత్తపల్లిలో రెండు లారీల ఢీ

ఓ డ్రైవర్‌కు విరిగిన కాలు.. మరో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలు

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలో శనివారం వేకువజామున రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్‌– జగిత్యాల ప్రధాన రహదారి కొత్తపల్లి చెరువు స మీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికులు, బ్లూకోల్ట్స్‌ పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్‌లో రైస్‌మిల్లు సా మగ్రి ఖాళీ చేసి కరీంనగర్‌ వైపు వస్తున్న లారీ ఖ మ్మం నుంచి గ్రానైట్‌ లోడ్‌తో గంగాధర వైపు వెళ్తు న్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గ్రానైట్‌ లోడ్‌తో ఉన్న లారీ కొత్తపల్లి చెరువులో పడిపోయింది. ఓ లారీ డ్రైవర్‌ పురుషోత్తంరెడ్డి, క్లీనర్లు లారీ నుంచి బయట పడగా తలకు గాయాలయ్యాయి. లారీ యజమాని సూచనల మేరకు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. రాజస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ గల డ్రైవర్‌ భన్సీలాల్‌కు గాయాలు అధికంగా కావడంతో పాటు కాలు విరిగడంతో కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రాగి తీగ దొంగల అరెస్ట్‌1
1/1

రాగి తీగ దొంగల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement