ఘనంగా మహనీయుల జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మహనీయుల జయంతి

May 1 2025 1:56 AM | Updated on May 1 2025 1:56 AM

ఘనంగా

ఘనంగా మహనీయుల జయంతి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం రాత్రి మహనీయుల జయంతి ఉత్సవ సభ నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ వోరుగంటి ఆనంద్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలో జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ల జయంతి వేడుకలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈక్రమంలోనే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో దరువు ఎల్లన్న, సభ కమిటీ కన్వీనర్‌ సావనపల్లి రాకేశ్‌, నాయకులు పసుల వెంకన్న, బీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌, వివిధ గ్రామాల అంబేడ్కర్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

స్వర్ణకార మహిళల ఆందోళన

ముస్తాబాద్‌(సిరిసిల్ల): స్వర్ణకారుల ఉపాధిని కాపాడాలని కోరుతూ దీక్షల్లో వారి కుటుంబికులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామపంచాయతీ ఎదుట ఏడు రోజులుగా స్వర్ణకారులు రిలే దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం స్వర్ణకారుల కుటుంబాలకు చెందిన మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. మండలా ధ్యక్షుడు చింతోజు బాలయ్య, చింతో జు లావణ్య, శ్యామల, స్వాతి, కవిత, ఎర్రోజు మంజుల, రమ్య, లక్ష్మి, రేఖ, ఉమ, ప్రేమల, శ్రీలేఖ పాల్గొన్నారు.

ఘనంగా   మహనీయుల జయంతి1
1/1

ఘనంగా మహనీయుల జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement