
సర్కారు బడులను బలోపేతం చేయాలి
సిరిసిల్లటౌన్: కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు దొంతుల శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ మండలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సంఖ్య తగ్గించే యోచన ప్రభుత్వానికి ఉంటే ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు బూర సదానందం మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. జి ల్లా ప్రధాన కార్యదర్శి ఆవురం సుధాకర్రెడ్డి, రాజేశ్వరరావు, దేవేందర్, వంగ తిరుపతి, విష్ణు ప్ర సాద్, సురేశ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.