
ధాన్యం కొనుగోలు చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చే యాలని కోరుతూ ఎల్లారెడ్డిపేటలో సోమవారం సింగారం గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేశా రు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు రావాలని, ధాన్యం తూకం వేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. సన్నవడ్లను తూకం వేయడం లేదన్నారు. ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని.. రైతులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్వో వసంతలక్ష్మి, తహసీల్దార్ సుజాత, సీఐ శ్రీనివాస్గౌడ్ చేరుకుని రైతులు, నాయకులతో మాట్లాడారు. ధాన్యం తూకం వేసి, వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మ ణ్ రావు, గుండాడి వెంకట్రెడ్డి, నాగరాజు, సందీప్, బీజేపీ నాయకులు పొన్నాల తిరుపతిరెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, కిరణ్నాయక్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేటలో రోడ్డెక్కిన రైతులు
అధికారులతో రైతులు, నాయకుల వాగ్వాదం