
నేడు శృంగేరికి అధికారులు
● రాజన్న ఆలయ అభివృద్ధికి మరో అడుగు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణకు మరో అడుగు ముందుకుపడనుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదివారం శృంగేరికి వెళ్లనున్నారు. ఆమేరకు ఆది శ్రీనివాస్ సూత్రప్రాయంగా ఈ అంశాన్ని శనివారం వెల్లడించారు. ఈనెల 17న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, వీటీడీఏ వైస్చైర్మన్ సందీప్కుమార్ ఝా, ఆర్అండ్బీ రాష్ట్ర స్థాయి అధికారులు, ఆలయ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తీసుకున్న ప్రాథమిక నిర్ణయాలను శృంగేరి పీఠాధిపతులకు వివరించి, అనుమతులు తీసుకోనున్నారు.