
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండలంలోని కందికట్కూరులో లబ్ధిదారు తాళ్లపల్లి శ్రీధర్ ఇంటికి ముగ్గుపోసే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరలో పా ల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి, నాయకులు గుడిసె ఐలయ్య, యాస తిరుపతి, గ్రామాధ్యక్షుడు బిగుల్ల విజయ్ పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు అందించాలి
సిరిసిల్లటౌన్: ఏడు నెలల పెండింగ్లో ఉంచిన తమ జీతాలు వెంటనే అందించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ స్కావెంజర్స్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమ సమస్యల సాధనకు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టగా స్వీపర్స్ స్కావెంజర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడా రు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేతనాలు అందించిన జిల్లాలో మాత్రం మూడు నెలలుగా పెండింగ్లో ఉంచారన్నారు. వెంటనే చెల్లించకుంటే జూన్ 16న నిరవదిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నెలకు రూ.15వేల వేతనం చెల్లించాలని కోరారు. ఎ.రాజశేఖర్, డి.వెంకటేశ్, దేవయ్య, రాజు, మహేశ్, పరశురాములు, లత, లావణ్య, అనిత పాల్గొన్నారు.
దమ్మన్నపేట శివారులో చిరుత సంచారం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేట శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. బుధవారం గ్రామస్తులకు చిరుత సంచారంపై అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హరిప్రసాద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అంజలి పాల్గొన్నారు.
గాలిపల్లి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ల కొనసాగింపు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట మాజీ ప్యాక్స్ చైర్మన్లను తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీవో రామకృష్ణ బుధవారం తెలిపారు. ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియడంతో వారి స్థానంలో కో–ఆపరేటీవ్ రిజిస్ట్రార్ లచ్చయ్యను గాలిపల్లి సొసైటీ స్పెషల్ ఆఫీసర్గా, బి.రమాదేవిని ఇల్లంతకుంట స్పెషలాఫీసర్గా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ గాలిపల్లి, ఇల్లంతకుంట సొసైటీల చైర్మన్లు అనంతరెడ్డి, తిరుపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారినే తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి