
దేశ సమగ్రత కాపాడుకుందాం
కొవ్వొత్తులతో ర్యాలీలో కేకే మహేందర్రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు
సిరిసిల్లటౌన్: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మృతులకు నివాళి అర్పిస్తూ శనివారం సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజు, మ్యాన ప్రసాద్, కాముని వనిత, కల్లూరి చందన పాల్గొన్నారు.