
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచుదాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
సిరిసిల్లకల్చరల్: న్యాయ వ్యవస్థపై సమాజానికి నమ్మకం పెరిగేలా సమన్వయంతో పనిచేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కక్షిదారులకు సరైన న్యాయం జరిగేందుకు అడ్వకేట్లు, జ్యుడీషియల్ అధికారులతో సమన్వయం పెంచుకోవాలన్నారు. నూతన కోర్టు భవనం మంజూరైన నేపథ్యంలో అవసరమైన అన్ని ప్రక్రియలను సమష్టిగా సాధించాలన్నారు. వీలైనంత త్వరగా నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపల్లి వెంకటి, సీనియర్ న్యాయవాదులు రవీందర్రావు, కోడం సురేశ్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మంద పుష్పలత, నర్మెట రమేశ్, గాజుల రాజమల్లు, ఉచ్చిడి శరత్రెడ్డి సీనియర్, జూనియర్ న్యాయవాదులు సుమారు 200 మంది పాల్గొన్నారు.