
అప్పు పుట్టడం లేదు
వ్యవసాయం తర్వాత అధికులైన నేతకార్మికులకు పనుల్లేవు. సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేసే కార్మికులకు యజమానులు తక్కువ కూలీ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి సిరిసిల్ల నేతకార్మికులకు యారన్ సబ్సిడీ ద్వారా రూ.7కోట్లు రావాల్సి ఉంది. అవసరాల నిమిత్తం ఇప్పటికే ఆ డబ్బు వచ్చాక ఇస్తామని అప్పులు చేసిండ్రు. ఇంట్లో శుభకార్యాలు, ఆరోగ్యపరిస్థితుల రీత్యా అప్పులు అడిగితే కార్మికులకు ఇచ్చేవారు లేకుండా పోతుండ్రు. పనుల్లేక కనీసం ఇంటి సరుకులు కూడా అప్పు ద్వారా తెచ్చుకోలేని పరిస్థితిని కార్మికులు ఎదుర్కొంటున్నారు.
– కోడం రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి