రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి

Apr 26 2025 12:21 AM | Updated on Apr 26 2025 12:21 AM

రైతుల

రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలు

బోయినపల్లి(చొప్పదండి): రైతులు సాగులో సాంకేతిక విధానాలు పాటించాలని జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ కె.మదన్‌మోహన్‌రెడ్డి కోరారు. బాబు జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయకళాశాల విద్యార్థులు మండలంలోని తడగొండలో శుక్రవారం రైతుసదస్సు, రైతులతో వ్యవసాయశాస్త్రవేత్తల చర్చాగోష్టి నిర్వహించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు శ్రీలత మాట్లాడుతూ మారుతున్న వాతావరణానికి అనుగణంగా రైతులు తమ పంటల సరళిని మార్చుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ కేబీ సునీతాదేవి నీటి యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్తలు మధూకర్‌రావు, రాజేంద్రప్రసాద్‌, ఉషారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇందూజ, మాధవి, అరుణ్‌, డీఏవో అఫ్జల్‌బేగం, ఏడీఏ రామారావు, ఉత్తమరైతు గుడి శ్రీనివాసరెడ్డి, నాయకులు చిందం రమేశ్‌, ఉయ్యాల శ్రీనివాస్‌, రావెప్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి

సిరిసిల్లటౌన్‌: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పలువురు కోరారు. స్థానిక శివనగర్‌ శివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హక్కుల్ని తుంగలో తొక్కిందన్నారు. లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్న వివిధ పరిశ్రమలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకొని కార్మికుల ఉపాధి దెబ్బతీయడం శోచనీయమన్నారు. వివిధ యూనియన్ల నాయకులు వెంగళ శ్రీనివాస్‌, గుర్రం సతీశ్‌, కూరపాటి రమేశ్‌, అజ్జా వేణు, కడారి రాములు, సోమిశెట్టి దశరథం, జిందం ప్రసాద్‌, గొట్టె రుక్మిణి, కోడం రమణ, మూషం రమేశ్‌, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన

కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సంక్షేమ పథకాలతో సుస్థిర పాలన అందించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపూర్‌, పోతిరెడ్డిపల్లి, అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన జై భీమ్‌.. జై బాపు, జై సంవిధాన్‌ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్‌కే గౌస్‌, శ్రీనివాస్‌, గుర్రపు రాములు, షకీల్‌, గోపాల్‌, బండారి బాల్‌రెడ్డి, బుచ్చాగౌడ్‌, బాబు పాల్గొన్నారు.

ముగిసిన ఓపెన్‌ పరీక్షలు

26న సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌

డీఈవో జనార్దన్‌రావు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ థియరీ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. శుక్రవారం ఉదయ 3 పరీక్షా కేంద్రాల్లో 704 మందికి 638 మంది విద్యార్థులు హాజరుకాగా.. మధ్యాహ్నం 2 పరీక్షా కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు 47 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 26 నుంచి సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల నియంత్రణ సహాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

రైతులు సాంకేతిక   పద్ధతులు పాటించాలి
1
1/1

రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement