
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఉపాధి కూలీలు, రైతులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారిణి సారియా అంజుమ్ అన్నారు. మండలకేంద్రంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు, ఐకేపీ కేంద్రాల వద్ద వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు.
కార్యవర్గం ఎన్నిక
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల ఎన్హెచ్ఆర్సీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా కాసుపాక శ్రీనివాస్, గంగం అనిల్ ప్రధాన కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా పినకాసి మనోహర్, సహాయ కార్యదర్శులుగా, కాసుపాక బాబు, నారెడ్డి రాజశేఖర్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూగజీవాలకు ఆహారం పంపిణీ
గంభీరావుపేట(సిరిసిల్ల): భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దమ్మ అటవీ ప్రాంతంలోని మూగజీవాలకు గొల్లపల్లికి చెందిన సత్యసేవా సమితి సభ్యులు గురువారం పళ్లు, మంచినీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ కూర రవి, సభ్యులు కొండ రమేశ్, భిక్షపతి, బాబు, శ్రీనివాస్, దేవేందర్, హర్షవర్ధన్, దేవేంద్ర, స్పందన, విజయ, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు.