
డబ్బుల్ అందవేమి?
ముస్తాబాద్(సిరిసిల్ల): సొంతింటి కల నిజం చేసుకునేందుకు అప్పు చేసి డబుల్బెడ్రూమ్ ఇళ్ల పనులు మొదలుపెట్టారు. అయితే బిల్లులు మంజూరుకాకపోవడంతో కొందరి ఇళ్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ అప్పు పుట్టక ఇళ్లు పూర్తికాక ‘డబుల్’ లబ్ధిదారులు కొందరు అద్దె ఇళ్లు.. మరికొందరు గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రస్తుత ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో సొంతింటి కల నిజం చేసుకుందామనుకున్న లబ్ధిదారులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పటికై నా తమను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులకు వర్తింపజేసి బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. – వివరాలు 8లో..