
రజతోత్సవ సభకు దండుగా కదలిరావాలి
● బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్
సిరిసిల్లటౌన్/ఎల్లారెడ్డిపేట: ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు దండుగా కదలిరావాలని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అందె సుభాష్, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్రావు, పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, రాచర్లబొప్పాపూర్, రాచర్లతిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, హరిదాస్నగర్, వెంకటాపూర్ గ్రామల్లో బుధవారం రజతోత్సవసభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నమిలికొండ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్, నర్సింలు, నాగరాజు, సీత్యానాయక్, గట్ల అనిల్, రాములునాయక్, శంకర్నాయక్, పర్శరాములు పాల్గొన్నారు.
ఇంటింటికీ ఆహ్వానపత్రిక
సిరిసిల్లలో మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి డప్పుచప్పుళ్ల మధ్య ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందించారు. నాయకులు గూడూరి ప్రవీ ణ్, బత్తుల వనజ, వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కూరపాటి భూమేశ్, వేముల తిరుపతి, ముదారపు లలిత పాల్గొన్నారు.
క్రీడలకు పెద్దపీట
● జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
సిరిసిల్లటౌన్: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. స్థానిక కాలేజీగ్రౌండ్లో బుధవారం జిల్లాస్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీలను జిల్లావాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొననున్నాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, గుడ్ల రవి, కోడం శ్రీనివాస్, నారాయణ, దేవయ్య, సంపత్, సురేష్, కోడం శ్రీనివాస్, బుర్ర నారాయణ పాల్గొన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఐఐటీ తిరుపతి నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ హాక్ 5.0 వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో మండలంలోని దమ్మన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పొన్నాల లోహిత ప్రతిభ కనబర్చింది. ఆన్లైన్లో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లోహిత తయారు చేసిన ‘క్లాస్ రూం ఫ్రెండినో’ ప్రదర్శనకు బహుమతి లభించింది. హెచ్ఎం వెంకటేశ్వర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు.

రజతోత్సవ సభకు దండుగా కదలిరావాలి

రజతోత్సవ సభకు దండుగా కదలిరావాలి