
యువకుడి అనుమానాస్పద మృతి
బోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన సందరగిరి రాకేశ్ (24) అ నుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై పృధ్వీధర్గౌడ్, స్థానికులు తెలిపిన వివరాలు.. బోయినపల్లికి చెందిన రాకేశ్ డిగ్రీ చదివి కరీంనగర్లో ప్రైవేట్ జాబ్ చే స్తూ అక్కడే నివాసం ఉంటాడు. ఇంట్లో జ రిగిన కార్యానికి ఈనెల 17న గ్రామానికి వచ్చాడు. 18న ఉ దయం బైక్పై బయటకు వెళ్లాడు. డ్యూటీకి వెళ్లాడని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కంగారు ప డ్డారు. మంగళవారం బోయినపల్లి– మర్లపేట శివారు లక్కుంట పరిసరాల్లో ఓ బైక్, వ్యక్తి మృతదేహం ఉండడాన్ని ఉపాధి కూలీలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా కొద్ది రోజులుగా తన కుమారుడు ఏదో బాధలో ఉంటున్నాడని తండ్రి గమనించి అడిగితే.. తన ప్రైవేటు ఫొటోలు స్నేహితుల వ ద్ద ఉన్నాయని, అవి బయట పెడితే తన పరువు పోతుందని తండ్రికి చెప్పాడని పోలీసులు తెలిపారు. రాకేశ్ ఆత్మహత్య చే సుకునేంత పిరికివాడు కాదని బంధువులు పేర్కొంటున్నారు. మృతదేహం కుళ్లిపోయింది. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరె డ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. రాకేశ్ మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.