ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య

Apr 23 2025 9:39 AM | Updated on Apr 23 2025 9:39 AM

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య

పాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్‌(జీడీనగర్‌) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు సాపల్ల శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల ఇంటర్‌ పరీక్షలు రాసింది. అయితే, శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య కన్నాల బోడగుట్ట క్వారీలో పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మంగళవారం వెలుబడిన ఇంటర్‌ ఫలితాల్లో కామర్స్‌ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయిన శశిరేఖ.. మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి శశిరేఖ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె కాగా ఇద్దరు కుమారులలో ఒకరు ప్రస్తుతం బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుచున్నాడు. మరో కుమారుడికి ఇటీవలనే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement