
ఇంటర్ ఉత్తీర్ణత
స్వల్పంగా పెరిగిన
● ఫస్టియర్ 51.74.. సెకండియర్లో 66.43 శాతం ఉత్తీర్ణత ● బైపీసీలో గంభీరావుపేట ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి 989 మార్కులు
సిరిసిల్లఎడ్యుకేషన్: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో గతేడాదితో పోలిస్తే సెకండియర్లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రకటించింది. గతేడాది సెకండియర్లో 65.21 శాతం, ఈసారి 66.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో గతేడాది 56.62, ఈ విద్యా సంవత్సరం 51.74 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఈసారి ఫస్టియర్లో 3,189 విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,976 మంది, సెకండియర్లో 3,670 మందికి 2,438 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చేనెల 22 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్ష ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు చెల్లించవచ్చని, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఈనె ల 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. కాగా, గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వి ద్యార్థిని కీర్తన బైపీసీలో 989 మార్కులు సా ధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్ర థమ స్థానంలో ఉన్నట్లు డీఐఈవో తెలిపారు.
కేజీబీవీలో ఫలితాలు..
జిల్లాలోని కస్తూరిబా పాఠశాలల విద్యార్థులు సత్ఫలితాలు సాధించినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్రావు తెలిపారు. సిరిసిల్ల కేజీబీవీలో సీఈసీ విభాగంలో ఎ.అశ్విని 913, కేజీబీవీ తంగళ్లపల్లి ఎంపీహెచ్డబ్ల్యూలో రేష్మ 968 మార్కులు సాధించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల గురుకులంలో ఫస్టియర్ 86 శాతం, సెకండియర్ 84 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో సామ శరణ్య 457, బైపీసీలో నందిని 424, సెకండియర్ ఎంపీసీలో లహరి 940, బైపీసీలో అశ్విత 980 మార్కులు సాధించగా వారిని ప్రిన్సిపాల్ అభిందించారు.