భూభారతితో సమస్యలు దూరం | - | Sakshi
Sakshi News home page

భూభారతితో సమస్యలు దూరం

Apr 23 2025 8:17 AM | Updated on Apr 23 2025 8:53 AM

భూభారతితో సమస్యలు దూరం

భూభారతితో సమస్యలు దూరం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి/చందుర్తి: భూ భారతి చట్టంతో ధరణి ఇబ్బందులు దూరం కానున్నాయని విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నా రు. మంగళవారం రుద్రంగిలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథులుగా విప్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ, ధరణి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర మంత్రులు, నిపుణులు భూ భారతి చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, భూభారతి చట్టంలోని వివరాలు వెల్లడించారు.

శాశ్వత పరిష్కారానికే భూ భారతి

భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం చందుర్తి రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టం ద్వారా భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌, నిషేధిత భూముల మార్పులు, చేర్పుల వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. అలాగే చందుర్తి మండలం మల్యాల, సనుగుల, లింగంపేట, రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం వెనువెంటనే తరలించాలని ఆదేశించారు. రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, చందుర్తి తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు మర్రి కృష్ణ, నాగుల శంకర్‌, నాయకులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement