కాంటా ఎప్పుడు పెడతారు | - | Sakshi
Sakshi News home page

కాంటా ఎప్పుడు పెడతారు

Apr 22 2025 12:08 AM | Updated on Apr 22 2025 12:08 AM

కాంటా

కాంటా ఎప్పుడు పెడతారు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌ హన్‌మాన్‌ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ధాన్యం కాంటా పెట్టడం లేదని.. ఎప్పుడు పెడతారో చెప్పాలంటూ నిరసనకు దిగారు. ధాన్యం ఎప్పుడు జోకుతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో మండుటెండల్లో పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంసీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి రైతులకు మద్దతు పలికారు. రైతులు బాలెల్లు, తాళ్ల రాజు, కర్రె మైసయ్య, శ్రీనివాస్‌ నిరసన తెలిపారు.

గ్రీవెన్స్‌ డేకు 25 ఫిర్యాదులు

సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు 25 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

జిల్లా కోర్టుకు నూతన పాలనాధికారులు

సిరిసిల్లకల్చరల్‌: జిల్లా న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు పాలనాధికారులు బదిలీపై వచ్చా రు. మూడో అదనపు జిల్లా జడ్జిగా మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ కోర్టులో విధులు నిర్వహిస్తున్న పి.మాధవి సిరిసిల్ల ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టు ముఖ్య పాలనాధికారిగా నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా కోర్టులో విధులు నిర్వహించిన బొజ్జా వేణుగోపాల్‌ సిరిసిల్ల మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టుకు పాలనా ధికారిగా నియమితులైనట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు.

‘డబుల్‌’ బిల్లుల జాప్యంపై ఆందోళన

గంభీరావుపేట(సిరిసిల్ల): డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ బిల్లుల జాప్యంపై మండలంలోని దేశాయిపేటలోని లబ్ధిదారులు సోమవారం గ్రామపంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ దత్తత గ్రామం దేశాయిపేటలో 20 ఇళ్లు మంజూరు కాగా.. ఏడుగురు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు రూ.లక్ష మాత్రమే చెల్లించారని తెలిపారు. మిగతా రూ.4లక్షలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పథకాలు

సిరిసిల్లటౌన్‌: అంతర్‌ జిల్లాస్థాయిలో ఉమెన్స్‌ విభాగం వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సిరిసిల్లకు చెందిన క్రీడాకారిణి నేహ స్వర్ణ పతకాలు సాధించింది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ స్థాయి పోటీలు నిర్వహించారు. వీటిలో జిల్లా నుంచి పాల్గొన్న నేహ కేటగిరీ సీనియర్స్‌ 63కేజీలో పాల్గొని స్వాట్స్‌ 110 కేజీ, బెంచ్‌ 47.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌ 132.5కేజీ విభాగాల్లో బంగారు పతకాలు సాఽధించింది. కోచ్‌ తదితరులు నేహను అభినందించారు.

జీపీవోలుగా అవకాశం ఇవ్వాలి

సిరిసిల్ల: జీపీవోలుగా ఆప్షన్స్‌ పెట్టుకున్న పూర్వపు వీఆర్‌ఏలకు(మున్సిపల్‌ విభాగంలో సర్దుబాటు కాబడిన) వార్డ్‌ ఆఫీసర్లకు జీపీవోలుగా అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఏవో) రాంరెడ్డికి సోమవారం వార్డు ఆఫీసర్ల ప్రతినిధులు వినతిపత్రం అందించారు. వార్డు ఆఫీసర్ల అ సోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు మల్లారం అర్జున్‌ మాట్లాడుతూ వీఆర్‌ఏలను 2023లో పదోన్నతులతో ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారన్నారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ ప రిపాలన అధికారి(జీపీవో) నియమించాలని చూస్తున్నారని వివరించారు. జీపీవోలుగా వీ ఆర్‌ఏలకు అవకాశం కల్పించాలని కోరారు. రహీం, రాకేశ్‌, దేవేంద్ర, ఆంజనేయులు, మంజుల, అంజమ్మ, పరశురాం, సుధీర్‌ ఉన్నారు.

కాంటా ఎప్పుడు పెడతారు
1
1/3

కాంటా ఎప్పుడు పెడతారు

కాంటా ఎప్పుడు పెడతారు
2
2/3

కాంటా ఎప్పుడు పెడతారు

కాంటా ఎప్పుడు పెడతారు
3
3/3

కాంటా ఎప్పుడు పెడతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement